మన ఇతిహాసాలు: భీమ మరియు బకాసుర కథ

పాండవులు తన తల్లితో కలిసి ప్రవాసంలో ఉన్నారు. వారు ఉండటానికి ఒక ప్రదేశం కోసం వెళ్ళుతున్న సమయంలో, వారు ఒక నిశ్శబ్ద గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో పాండవులకు ఒక బ్రాహ్మణ గ్రామస్థుడు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడుకి ఒక పెద్ద కుమార్తె మరియు ఒక చిన్న పిల్లవాడు ఉండెను. కొన్ని రోజులు ప్రశాంతంగా మరియు ఆనందంగా గడిపారు.



ఒకరోజు తల్లి కుంతీ బ్రాహ్మణ ఇంటి నుంచి వస్తున్న ఏడుపును వినెను. ఆమె అక్కడ ఏమి జరుగుతుందో చూడటానికి వెళ్ళెను. ఆ కుటుంబంలో ప్రతి సభ్యుడు తమ జీవితాన్ని త్యాగం చేయటానికి సిద్ధపడ్డారు. బ్రాహ్మణుడు జీవితాన్ని త్యాగం చేయటం తన బాధ్యత అని చెప్పడం జరిగింది. ఇంటి అధిపతిగా కుటుంబంను కాపాడటం తన విధిగా ఉంది. అతని భార్య కూడా కుటుంబం పట్ల తన విధి అని చెప్పింది.


బ్రాహ్మణుడుని కోరినప్పుడు


అతని కుమార్తె కూడా కుటుంబం పట్ల తన విధి అని చెప్పింది. ఇదే విధంగా, కుమారుడు కూడా చెప్పెను. కుంతీకి ఈ సంభాషణ వెనుక కారణం అర్థం కాలేదు. ఆమె ప్రశాంతంగా వివరించాలని బ్రాహ్మణుడుని కోరినప్పుడు, అతను బకాసుర కధను చెప్పెను. బ్రాహ్మణుడు ఒప్పందం గురించి వివరించాడు.


ప్రతిరోజూ ఓ గ్రామస్తుడు..


ప్రతి రోజు ఒక గ్రామస్థుడు ఒక బండి ఆహారంను తీసుకోని రాక్షసుడు దగ్గరకు తీసుకువెళ్ళాలి. అప్పుడు ఆ రాక్షసుడు ఆ గ్రామస్థుడుని మరియు ఆహారాన్ని రెండింటిని తింటుంది. ఆ విధంగా రాక్షసుడు అనేక మంది గ్రామస్తులను చంపెను. ఈ రోజు మా కుటుంబం వంతు వచ్చింది. మా కుటుంబం నుండి ఒక సభ్యుడు ఆహారం తీసుకోని వెళ్ళాలి. రాక్షసుడునకు ఆహారాన్ని అందించాలని చెప్పెను. అప్పుడు కుంతీ "నా కుమారుడు భీమ మీకు సహాయం చేయగలదు. అతను మీ కుమారుడు స్థానంలో వెళ్ళతాడు" అని చెప్పెను.



బ్రహ్మణ స్త్రీ వినలేదు..


కానీ ఆ బ్రహ్మణ స్త్రీ వినలేదు. "అరెరే! నేను మీ కొడుకు చనిపోవడానికి ఒప్పుకోను. మీరు మా అతిధులు" అని అనెను. కుంతీ నెమ్మదిగా నవ్వి మీరు భయపడవద్దని చెప్పెను. నా కుమారుడు భీమ అంతకు ముందు రాక్షసులను చంపెను. అతను సురక్షితంగా తిరిగి వస్తాడు. పాండవుల దగ్గరకు వచ్చి, కుంతీ రాక్షసుడు గురించి మరియు ఆమె చేసిన వాగ్దానం గురించి చెప్పెను. భీమ బకాసుర కోసం ఆహారం తీసుకువెళ్ళటానికి సిద్దంగా ఉన్నానని చెప్పెను. తరువాతి రోజు తెల్లవారుఝామున భీమ బియ్యం,పాలు, కూరగాయలు, పండ్లు మరియు స్వీట్లు తో కూడిన బండిని నేట్టుతూ తీసుకువెళ్ళెను.


భీమ అడవికి చేరుకున్న తర్వాత, అతనికి బకాసుర ఎక్కడ కనపడలేదు. అందువలన అతను ఒక చెట్టు నీడలో కుర్చోనేను. కొంత సేపటికి ఆకలితో అరటిపండ్లను తినడం ప్రారంభించేను. కొంత సమయానికి అరటి పండ్లు అన్ని పూర్తి అయ్యెను. అప్పుడు అతను బియ్యం, ఆపై పండ్లు మరియు స్వీట్లను కూడా తినెను.


భీమ దాదాపు మొత్తం ఆహారాన్ని తిన్న తర్వాత రాక్షసుడు వచ్చెను. రాక్షసుడు బీకరంగా ఉన్నాడు. అతనికి ఖాళీ బండిని చూసి చాలా కోపం వచ్చెను. అతను భీమ వైపు పరుగెత్తుకొని వచ్చి అతని మీద దెబ్బలు వర్షం కురిపించెను. రాక్షసుడు గట్టిగా గర్జించి, నా ఆహారం తినటానికి ఎంత ధైర్యం అని అనెను. నేను ఆకలితో ఉన్నాను.


భీమ నవ్వుతూ


భీమ నవ్వుతూ, నేను ఆకలితో ఉన్నాను మరియు మీరు రావటం ఆలస్యం అయిందని అనెను. బకాసుర పళ్ళు కొరుకుతూ బీమ మీదకు పరుగెత్తెను. భీమ సిద్ధంగా ఉండెను. వారిద్దరూ గొప్ప పోరాటంను ప్రారంభించారు. బకాసుర బీమ మీదకు పెద్ద పెద్ద చెట్లను విసిరెను.


కానీ బీమ వాటిని పట్టుకొని చిన్న చిన్న కొమ్మలుగా విరిచి పడవేసెను. పోరాటంలో బీమ బకాసురను చంపెను. బకాసురను ఒక తాడుతో బండికి కట్టెను. అతనిని అన్ని మార్గముల ద్వారా తిప్పి గ్రామమునకు తీసుకువచ్చెను. గ్రామస్తులు రాక్షసుడు చనిపోయాడని నమ్మలేకపోయారు. వారు కన్నీళ్లతో భీమకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ గ్రామంలో ఆ రాత్రిని గొప్పగా స్మరించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.

Post a Comment

Comments