తెలుగులో విడుదల అవుతున్నశంభాజీ మహారాజ్ సినిమా "ఛావా "- శంభాజీ మహారాజ్ గురించి పూర్తి వివరాలు: Sambaji Maharaj life history

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ గురించి పూర్తి వివరాలు 

బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన ఛావా సినిమా ఇప్పుడు తెలుగులో కూడా గీత ఆర్ట్స్ బ్యానర్లో మార్చి 7 న తెలుగు ప్రేక్షకుల ముందుకుకి వస్తుంది. 

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ 

    శంభాజీ మహారాజ్ (1657-1689) , ఛత్రపతి శివజీ మహారాజ్ కుమారుడు , మరాఠా సామ్రాజ్యానికి రెండవ ఛత్రపతిగా పేరుగాంచిన రాజు. శంభాజీ మహారాజ్ జీవితంలో ఎన్నో ఉత్తేజకరమైన వీరగాధలతోపాటు , ఘోరమైన సంఘటనలు కూడా ఉన్నాయి . అతని జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటన అతని మరణం, భారతదేశ చరితలోనే ఒక గొప్ప అధ్యాయంగా మిగిలిపోయింది. అతను మరణం తన ముందుఉన్న కూడా భయమే తెలియని గొప్ప మరాఠా వీరుడు. 

శంభాజీ మహారాజ్ : ఒక గొప్ప వీరుడి పుట్టుక 

 శంభాజీ మహారాజ్ 14, మే , 1657 లో పురంధర్ ఫోర్ట్ నందు జన్మించాడు. శంభాజీ మహారాజ్ కి చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయాడు . కానీ తండ్రి శివాజీ మహారాజ్ వీరోచిత లక్షణాలు అలవర్చుకున్నాడు . శంభాజీ తన తండ్రి వలె గొప్ప సేనానిగా ఎదిగాడు. 

మొగల్  సామ్రాజ్యంతో శంభాజీ పోరాటం

    మొగల్ చక్రవర్తి ఔరంగజేబు భారతదేశాన్ని తన గుప్పటిలోకి తెచ్చుకోవాలి ప్రయత్నిస్తుండగా , శంభాజీ మహారాజ్ తన మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను సైతం లెక్కచేయలేదు . అతని యుద్ధ విద్యలు, శత్రువులని తన బుద్ది బలంతో జేయించేవాడు . అయితే శంభాజీ మహారాజ్ దగ్గరి బంధువులు , నమ్మిన వల్లే అతనిని మోసం చేయడం , ఆయనికి తీవ్ర కష్టాలు మిగిలించాయి . శంభాజీ మహారాజ్ అతని ధైర్య సాహసాలకు , మొగల్ అధిపతులని ఎదుర్కోవడం లో, మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడడం, మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడం లో ఎంతో ప్రసిద్ధి చెందినారు . 

కాబందీ సంఘటన : శంభాజీ మహారాజ్ ని మొగల్ సైన్యం పట్టుకున్న రోజు 

    1689లో , శంభాజీ మహారాజ్ తన అత్యంత నమ్మకస్తుడు అయిన కాకా మహిత్రే వల్లన మోసపోయాడు. మొఘల్ సైన్యం శంభజీ మహారాజుని బందీగా చేసుకున్నారు.


శంభాజీ మహారాజ్ పై ఔరంగజేబు కక్ష సాధింపు :

    శంభాజీ మహారాజ్ ను మొఘల్ సైన్యం బంధించిన తరువాత ఔరంగజేబు దగ్గరకి తీసుకువెళ్లారు . అతను శంభాజీ ని చిత్రహింహాసాలకి గురి చేసారు . శంభాజీ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి అతని కళ్ల ముందే అతని ప్రాణస్నేహితులని భయంకరంగా చంపారు . 

శంభాజీ మహారాజ్ నాలుకను కూడా చీల్చారు , కళ్ళను పొడవడం వంటి అమానుష పద్దతులలో హింసించారు . అతను బతికి ఉండగానే చర్మాన్ని కూడా తీశారు . రాక్షసుల మాదిరిగా అతని కాళ్ళు , చేతులు నరికారు . 


మరాఠా వీరుడి మరణం :

    ఔరంగజేబు చేసిన నరకయాతనాలకి కూడా శంభాజీ మహారాజ్ తన ధైర్యాన్ని కోల్పోలేదు .  మరణం చివరి క్షణం వరకు "హర హర మహాదేవ్ " అని జపిస్తున్నాడు అని చరిత్ర చెబుతుంది . అతని మరణం మరాఠా ప్రజల గుండెల్లో అగ్గిని రగిలించింది . శంభాజీ మహారాజ్ మరణంతో మొగల్ సైన్యం మరాఠాలు కట్టిడిని ప్రయత్నించినా , అతని వీర మరణం మరాఠా గడ్డపై ఆత్మగౌరవాన్ని , పోరాట స్ఫూర్తిని నింపింది .  

శంభాజీ మహారాజ్ జీవిత కధ ఎంతో ఘోరమైన , దారుణమైన సంఘటనలకు నిదర్శనం . కానీ అతని దైర్యం , మరాఠా సామ్రాజ్యం కోసం అతను చూపిన పోరాట పటిమ , అతను చేసిన త్యాగం ఈనాటికి భారతదేశ చరిత్ర లో చిరస్థాయిగా మిగిలి ఉంటుంది . 



Post a Comment

Comments